Uppena: మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ కి డెబ్యూ సినిమా అయిన ‘ఉప్పెన’ Uppena సినిమా రికార్డుల గురించి టాలీవుడ్ మొత్తం వినిపిస్తుంది. విడుదల అయిన అతి కొద్దీ రోజులలోనే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టగలిగింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చిన కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 18 కోట్ల షేర్ ను సొంతం చేసుకుందంటేనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కేవలం మూడవ రోజు నుంచే ఈ సినిమా కు లాభాలు చేకూరుతున్నాయి.
ఉప్పెన ప్రీ రిలీజ్ బిజినెస్ గా మొత్తం 20 కోట్ల ఖర్చుపెట్టగా ప్రస్తుతం ఈ సినిమాకు భారీ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు బూచి బాబు అలాగే హీరోయిన్ కృతి శెట్టి కి ఇది డెబ్యూ సినిమానే అయినప్పటికీ ఊహించని విధంగా ఈ సినిమా సక్సెస్ఫుల్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇదిలా ఉండగా తెలుగు ప్రేక్షకులలో ఇపుడు ఇంకొక కొత్త డౌట్ మొదలయ్యింది. అదేమిటంటే, ఉప్పెన సినిమాను ఓటిటిలో ఎప్పుడు విడుదల చేస్తారు అని.
ఉప్పెన సినిమా ఎప్పటి నుంచి ఓటీటీ లో ప్రసారం చేస్తారు అనే విషమై గట్టిగానే చర్చ వినిపిస్తుంది. పైగా కరోనా నేపథ్యంలో ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో ‘కమింగ్ సూన్’ అంటూ ప్రచారం చేశారు. ఇక దీనితో ఉప్పెన సినిమా కేవలం నెల లోపే ఓటీటీ లోకి వస్తుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా ఓటీటీ నుంచి 40 రోజుల టైమ్ గ్యాప్ తీసుకుందట. అంటే మిగిలిన సినిమాల లాగా కాకుండా ఈ సినిమా కొంచెం ఆలస్యంగా ఓటీటీ లోకి రానున్నదని అర్ధమవుతుంది.