యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 57 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 57 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు :
1. స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్: 55 పోస్టులు
విభాగాలు :
ఆప్తమాలజీ, పీడియాట్రిక్, కార్డియాలజిస్ట్, డెర్మటాలజీ , వినెరియాలజీ అండ్ లెప్రసీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అబ్ స్త్రటిక్స్ అండ్ గైనకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు :
ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్ లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 3 సంవత్సరాల పాటు టీచింగ్ లో అనుభవం ఉండాలి.
వయస్సు :
40 సంవత్సరాలు దాటకూడదు.
2. అసిస్టెంట్ డైరెక్టర్ (షిప్పింగ్):1 పోస్టు
అర్హతలు :
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయస్సు :
35 సంవత్సరాలు దాటకూడదు.
3. అసిస్టెంట్ డైరెక్టర్ (బాలిస్టిక్స్):1 పోస్టు
అర్హతలు సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అనలిటికల్ మెథడ్స్, పరిశోధనల్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు :
40 సంవత్సరాలు దాటకూడదు.
ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ టెస్ట్ , ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు :
రూ. 25/- జనరల్ , ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు. ఎస్సీ, ఎస్టీ , పీహెచ్ , మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించినవసరం లేదు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 28/1/2021.