కరోనా మహమ్మారి రాకతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఆయా దేశ పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దీని భారిన పడుతున్నారు. మరెంతో మంది ప్రాణాలను బలిగొంది ఈ కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కోట్ల మంది దీని భారిన పడ్డారు. కాగా ఈ కరోనా మహమ్మారి అమెరికాను గజ గజ వణికించేస్తుంది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల్లో అమెరికానే ముందంజలో ఉంది.
దీనితో కరోనా వచ్చిన 12 వ రోజు అమెరికాలో లక్షకు పైనే కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే శనివారం ఒక్క రోజు అమెరికాలో 1,66,555 కేసులు నమోదయ్యాయి. ఈ కోవిడ్ 19 తో శనివారం ఒక్కరోజే 1,266 మంది చనిపోయారు. కాగా అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,12,48,681కి చేరుకుంది. కాగా ఇప్పటి వరకు కరోనాతో అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 2,5,330 మందికి చేరింది.
కాగా ఇంతలా కేసుల సంఖ్య పెరిగే కొద్ది అక్కడి హాస్పటళ్లపై మరింత భారం పెరిగే అవకాశముందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్ పెట్టే పరిస్థితులు ఏర్పడవచ్చేని నిపుణులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే మెక్సికోలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. అక్కడ ఇప్పటి వరకు 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యయి. అలాగే 98,259 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో మంగళవారం నుంచి దేశమంతటా లాక్ డౌన్ ను విధిస్తున్నారు.
కాగా అక్కడ శుక్రవారం ఒక్క రోజే 9,586 కరోనా కేసులు నమోదయ్యాయి. కఠినంగా కరోనా నియంత్రణ మార్గాలను పాటించాలని, ఇంటి సభ్యులను మినహా ఎవరినీ కలుసుకోవద్దని ఆ దేశ చాన్సలర్ సెబాస్టియన్ ప్రజలకు సూచించారు. కాగా మంగళవారం నుంచి మొదలు కానున్న లాక్ డౌన్ డిసెంబర్ 6 వరకు కొనసాగించనున్నట్టు స్పష్టం చేశారు. అలాగే అత్యవసర సేవలు తప్ప మిగతావన్ని మూసివేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటుగా ఇటలీలోని కంపేనియా, టస్కనీల్లోనూ ఆదివారం నుంచి లాక్ డౌన్ ను అక్కడి ప్రభుత్వాలు విధిస్తున్నట్టు స్పష్టం చేశాయి.