USIndiaDosti: భారత్ Bharat లో కోవిడ్ విజృంభణ రెండవ దశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా America తో సహా వివిధ దేశాలు సాయం చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు భారత్ కు ఆమెరికా, బ్రిటన్, రొమెనియా నుండి అత్యవసర సహాయం, పరికరాలు చేరుకున్నాయి. అమెరికా నుండి బయలుదేరిన అత్యవసర సహాయం, పరికారాల తొలి విడత షిప్ మెంట్ భారత్ చేరుకున్న విషయాన్ని భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. యూఎస్ ఇండియా దోస్తీ అనే హ్యాష్ ట్యాగ్ ఇస్తూ భారత్ – అమెరికాలు కోవిడ్ పై ఉమ్మడిగా పోరాడుతాయని పేర్కొంది.
అమెరికా నుండి వచ్చిన వారిలో 400 ఆక్సిజన్ సిలెండర్లు, దాదాపు పది లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, ఆసుపత్రుల్లో వినియోగించే అత్యవసర పరికరాలు ఉన్నాయి. వీటిని తీసుకువచ్చిన ఆమెరికా సూపర్ గెలాక్సీ విమానం ఢిల్లీ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
ఇటీవలే ఆమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్ కు అత్యవసర సహాయం గురించి స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆమెరికాలో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో భారత్ తమ పక్షాన నిలిచిందనీ, ఇప్పుడు భారత్ కు తమ అవసరం వచ్చిందన్నారు. భారత్ లో టీకాల ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్ధాల సరఫరాకు ఆమెరికా అంగీకారం .
కాగా రోమేనియా నుండి 80 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 75 ఆక్సిజన్ సిలెండర్ లు, యుకే నుండి 280 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు నేడు అందినట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందం బగానీ వెల్లడించారు. అంతకు ముందు ఇర్లాండ్ నుండి భారత్ కు 700 అక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 365 వెంటిలేటర్లు అందాయి. ఈ సాయం అందించడం పట్ల ఆయా దేశాలకు భారత్ ధన్యవాదాలు తెలియజేసింది.