నేడు ఎవరి చేతిలో చూడూ మొబైల్ ఫోన్లు దర్శనమిస్తుంటాయి. అందులోనూ ఆన్ డ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు కనిపిస్తుంటాయి. కాని మొబైల్ ఫోన్లు లేని ఇల్లు లేదంటే మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.. వీలైనంత వరకు సాధారణంగా ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు ఉండాల్సిందే. అవి అరిగే దాకా వాడాల్సిందే.. అది చూసిన కొంత మంది ఏంటో ఈ కాలం తిండి లేకుండానైనా ఉంటారు కాని మొబైల్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నరంటూ మాట్లాడుతుంటారు. నిజమే కదా చేతిలో ఒక్క క్షణం లేకుండా ఉండలేకపోతుంటారు చాలా మంది. టెక్నాలజీ పరంగా మొబైల్ ఫోన్లు అవసరమే.
ఎందుకంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిందో క్షణాల్లో తెలుసుకునే వెసలు బాటును కల్పిస్తోంది స్మార్ట్ ఫోన్. కాని నేటి జనరేషన్ మాత్రం సమాచారం తెలుసుకోవడానికి ఏ మాత్రం వాడతారో తెలియదు కాని టైం పాస్ కు మాత్రం బాగానే వాడతారని వారిని చూస్తేనే అర్థమవుతుంటుంది. ఈ ఫోన్లకోసం ప్రాణాలు తీసుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారండోయ్.. కాని ఒకప్పుడు మాత్రం చాలా మంది కుటుంబాల్లో ల్యాండ్ లైన్ ఫోన్లనే అధికంగా వాడేవారు. దాని మూలంగా ఎటువంటి అనర్థాలుగాని వచ్చేవి కావు. అయితే ఇప్పటికి కూడా చాలా మంది కాల్స్ మాట్లాడటానికి స్మార్ట్ ఫోన్ల కంటే ల్యాండ్ లైన్ ఫోన్లకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
ఇలాంటి వారుకూడా ఈ జనరేషన్ లో ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పుకోవచ్చు. అయితే వీరి కోసమే ట్రాయ్ ఒక ఉత్తర్వును కూడా జారీ చేసింది. అందేటంటే ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్లకు కాల్స్ చేసి మాట్లాడేవారికే ఈ వార్త అన్నమాట. అసలు విషయం ఏంటంటే.. 2020 జనవరి 1 నుంచి ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి మొబైల్స్ లకు కాల్స్ చేసేటప్పుడు మరో అంకెను జత చేయాలని ట్రాయ్ సూచిస్తుంది. అంటే ఇప్పుడున్న పది అంకెల ముందు మరో అంకె అంటే ‘0’ ను జతయాలన్నమాట. అయితే టెలికాం కంపెనీలకు ఇందుకు అవసరమైన వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని ట్రాయ్ ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది.
అయితే దీనితో పాటుగా కొత్త నంబర్లను కూడా జారీ చేసేందుకు వీలుకల్పించడంతో సంస్థలు అంగీకరించాయని చెప్పుకోవచ్చు. కాగా వచ్చే ఏడాది మొదటి నుంచి మొబైల్ నంబర్ల ముందు సున్నాను జతచేయాలన్నమాట. కాగా నవంబర్ 20 న ట్రాయ్ ఇందుకు అవసరమైన సాంకేతిక వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ల్యాండ్ లైన్ వినియోగదారులకు సున్నా ఫెసిలిటీని కల్పించాలని వెళ్లడించింది. ఈ పని జనవరి 1 లోపు పూర్తి కావాలని ఆదేశించింది. ఈ మార్పుల మూలంగా ఫ్యూచర్ అవసరాల నిమిత్తం అదనంగా 2,544 మిలియన్ల నంబర్లు లభించనున్నాయని తెలిసింది.