ముందు యూఎస్ లోని ఉటా ఎడారిలో ఆ తరువాత రొమేనియా డేసియన్ కోట సమీపంలో కనిపించి ప్రపంచమంతా చర్చనీయాంశమైన లోహపు దిమ్మె మిస్టరీ ఇపుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇది చేసిందంతా మనుషులే అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. రొమేనియా లో కనిపించిన లోహపు దిమ్మెను నలుగురు మనుషులు ఉటా ఎడారిలో నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను రోస్ బెర్నార్డ్ అనే ఫొటోగ్రాఫర్ విడుదల చేశారు.
శుక్రవారం నాడు తాను లోహపు దిమ్మెను సందర్శించేందుకు వెళ్లానని అది తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు కూడా చేశా అని ఆయన పేర్కొన్నారు. మరియు ఆ రాత్రివేళ తాను అక్కడే ఉన్నానని, నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి, లోహపు దిమ్మెను చక్రాల బండిలో వేసుకుని వెళ్లడం ఆయన చూశానని చెబుతున్నారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలను తాను ఫొటో తీశానని సాక్ష్యాలు చూపిస్తున్నారు. వారంతా ఆ చీకటిలో పనిచేసేందుకు వీలుగా హెడ్ ల్యాంప్స్ ను ధరించి వున్నారని ఆయన చెబుతున్నారు.