తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి బీజేపీలో చేరనున్నట్లు ఇటీవల వార్తలు వైరస్ కావడం అందరికీ తెలిసిందే. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో అదేవిధంగా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డితో విజయశాంతి మంతనాలు జరిపినట్లు త్వరలోనే ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ కి టాటా చెప్పి బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు ఇటీవల రావడం జరిగాయి. దుబ్బాక ఉప ఎన్నికలకు ముందే బిజెపిలో చేరుతారని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో చాలామంది కన్ఫామ్ అని ఫిక్స్ అయిపోయారు.
విజయశాంతి బీజేపీ లోకి వెళ్లి పోవడం గ్యారెంటీ అని అందరూ డిసైడ్ అయిపోయారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టిపారేశారు. విజయశాంతి తో మాట్లాడటం జరిగిందని కరోనా ప్రభావం కారణంగా బయటకు రాలేక పోతున్నాను, దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి కూడా ఇందువల్ల దూరంగా ఉన్నట్లు ఆమె చెప్పినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావో రేవో అన్నట్లుగా మారింది. ఈ ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ కి తెలుగుదేశం పార్టీ కి పట్టిన గతే పట్టె అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.