విశాఖపట్నం: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు స్వాగతించారు. శనివారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో సమావేశమైన ఆ సమితి నేతలు మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ తీరును సమర్థిస్తూ తీర్మానం చేశారు. ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీరు బాగోలేదని ఆక్షేపించారు. విశాఖలో రాజధాని ఎందుకు? అంటూ ఆయన ప్రశ్నిస్తుండడం సరికాదన్నారు. ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షను తెలియజేయడానికే ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితిని స్థాపించామన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ ఏర్పడితే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని సమితి నేతలు అభిప్రాయపడ్డారు.
previous post
next post