టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సినిమా వచ్చి చాలా నెలలు కావస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు కూడా థియోటర్స్ ఓపెన్ అవుతాయన్న కారణంగా చాలా నెలలు అలా ల్యాబ్ లోనే ఉండిపోయాయి. కాని కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పట్లో థియోటర్స్ ఓపెన్ అయ్యో పరిస్థితులు లేకపోవడంతో మేకర్స్ ఓటీటీ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా.. అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘వి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని కెరీర్లో 25వ సినిమాగా వచ్చిన ‘ వి ‘ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు నాని. అదీకాక నాని ని అష్టా చమ్మా సినిమాతో హీరోగా చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ నాని 25 వ సినిమా తీయడంతో అందరికి ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది.
కాగా ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. అందరూ భావించినట్టుగా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంలో ‘వి’ ఫలం అయింది. ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా పెద్ద ఆకట్టుకోలేదన్న మాట చెప్తున్నారు. అయితే ఇంతకాలం ఈ సినిమా మీద క్రియోటయిన బజ్ మొత్తం ఒక్క షో తో పోయింది.
అయితే నాని సినిమా రిలీజ్ చేయడం తో మరికొన్ని సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ ఇప్పుడు ఆలోచిస్తున్నారట. ఎంతైనా సిల్వర్ స్క్రీన్ కి స్మాల్ స్క్రిన్ కి తేడా ఉంటుంది. ఒక సినిమాని థియోటర్ లో చూసిన ఫీల్ డిఫ్రెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టే నాని వి అంతగా ఆకట్టుకోలేదన్న మాట చాలామంది నుంచి వినిపిస్తుంది. నిన్నా.. మొన్నటి వరకు ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్న సినిమాల విషయంలో మేకర్స్ తమ అభిప్రాయాలని మార్చుకుంటున్నట్టు తెలుస్తుంది.