బెంగుళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ఎన్ఎల్ఎస్ఐయూ లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేస్తుంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఇలా..
ఖాళీలు ఉన్న విభాగాలు :
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు :
పోస్ట్ ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ 55 శాతం మార్కులు, పీహెచ్ డీ ఉత్తీర్ణత, నెట్, ఎస్ఎల్ఈటి, సెట్ అర్హత ఉండాలి. సంబంధిత పోస్ట్ ను అనుసరించి ఆయా విభాగాల్లో అనుభవం తప్పనిసరి.
వయస్సు : యూజీసీ నిబంధనల ప్రకారం కనీస వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం :
స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. షార్ట్ లిస్ట్ అభ్యర్థుల వివరాలను ఈమెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తారు. ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 24/1/2021