BREAKING : ఏపీలో వ్యాక్సిన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. కరోనా కట్టడికి సీఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అట్టహాసంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా ఓ చిన్నారికి సీఎం జగన్ సమక్షంలో పీసీవీ టీకాను వేయడం జరిగింది.
పిల్లల్లో న్యుమోనియా అనేది రావడం జరుగుతుంటుంది. దానిని రాకుండా అరికట్టడానికి న్యుమోనియాతో పిల్లల మరణాలు జరగకుండా ఉండటానికి పీసీవీ వ్యాక్సినేషన్ ను సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటిదాకా పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అందిస్తోంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
BIG BREAKING: సీఎం జగన్ బెయిల్ రద్దు తీర్పులో ఆఖరి నిమిషం లో ట్విస్ట్ ఇచ్చిన జడ్జిగారు..!