హిందీ, తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాని పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా గా చేస్తున్న విషయం తెలిసందే. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ లో అజిత్ పోషించిన పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. 2020 మే 15 న సినిమాను విడుదల చేయాలనుకున్నారు దిల్ రాజు బృందం. కాని కరోనా కారణంగా సినిమాను పూర్తి చేయలేక పోయారు.
ఇక మళ్ళీ వకీల్ సాబ్ మొదలు కాబోతుందన్న వార్తలు వస్తున్నాయి. కాగా దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వెల్లడించారు. వకీల్ సాబ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ చాలా వరకు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ ‘పింక్’ రీమేక్ కి ప్రధానమైన కథను దాదాపు మార్చినట్టు న్యూస్ క్రియోటయింది.
కాని ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని దర్శకుడు వేణు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక డిసెంబర్ వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్దం చేసేలా ప్లాన్ చేస్తున్నామంటూ వకీల్ సాబ్ గురించి తెలిపాడు. 2020 ప్రారంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని తెలిపాడు. కాగా ఈ సినిమాలో అయిదు పాటలు ఉంటాయని.. కొన్ని కమర్షియల్ సీన్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. అంతకు మించి ఈ సినిమా గురించి వస్తున్న మిగతావన్ని అవాస్తవాలే అంటూ వెల్లడించాడు వేణు శ్రీరామ్. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.