ప్రతీ దర్శకుడి సినిమా జీవితం దాదాపు కష్టాల సుడుల నుంచే మొదలవుతుంది. చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో దర్శకుడవటం అనేది కొత్త జీవితమనే చెప్పాలి. ఇది ఒక ఎత్తైతే దర్శకుడిగా మొదటి సినిమా తీశాక దానిమీదే అసలు జీవితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ హీరోకైనా..హీరోయిన్ కైనా…దర్శకుడికైనా సక్సస్ మాత్రమే ఇంపార్టెంట్. అది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సక్సస్ ఉంటేనే దర్శకుడి వెంట నిర్మాతైనా…హీరో అయినా..లేదంటే మొహం కూడా చూడరు.
ఇలాంటి పరిస్థితులనే కాదు కుటుంబంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు దర్శకుడు వేణు శ్రీరాం. దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన వేణు శ్రీరాం మొదటి ప్రయత్నంగా ఓ మై ఫ్రెండ్ అన్న సినిమాని తీశాడు. ఈ సినిమాతో వేణు శ్రీరాం ని దిల్ రాజు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఈ సినిమా దారుణంగా పరాజయాన్ని చూసింది. అదే సమయంలో తండ్రిని పోగొట్టుకోవడం .. ఇలా దెబ్బ దెబ్బ మీద పడ్డాయి. మళ్ళీ సినిమా చేసే అవకాశం కూడా రాలేదు. ఈ మధ్యలో చేసిన ప్రయత్నాలన్ని ఫలించలేదు. మొదటి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్..రవితేజ..అల్లు అర్జున్ ల కోసం కథ రాశాడు.
అయితే ఏదీ వర్కౌట్ కాలేదు. అల్లు అర్జున్ తో అనుకున్న ఐకాన్ ఇదుగో అదుగో అంటూనే పెండింగ్ లో పడింది. అయితే ఎట్టకేలకి మళ్ళీ దిల్ రాజు నాని తో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా వేణు శ్రీరాం కి ఊపిరి పోసింది. సక్సస్ అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేసే ఛాన్స్ తో మళ్ళీ కెరీర్ సక్సస్ బాట పట్టింది. వకీల్ సాబ్ కంప్లీటవగానే అల్లు అర్జున్ తో అనుకున్న ఐకాన్ ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నాడు. కానీ వేణు శ్రీరాం ఈ సక్సస్ కోసం పడ్డ కష్టాలు..అనుభవించిన బాధలు వర్ణనాతీతం అని చెప్పాలి.