2019 ఎన్నికలలో గన్నవరం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ అతి తక్కువ టైమ్ లోనే వైసిపి పార్టీకి పరోక్షంగా మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఏకంగా నిండు అసెంబ్లీ లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ని వంశీ నిలదీసి వైయస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. ఇదే రీతిలో వల్లభనేని వంశీకి వైయస్ జగన్ కూడా ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో వంశీ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతకుముందు వంశీ మీద వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని ఇచ్చి సైడ్ చేయించారు. దీంతో గన్నవరంలో వల్లభనేని వంశీ కి ఎదురు లేదు అని అనుకున్న టైం లో తెరమరుగైన వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రాంచంద్రరావు వర్గం తాజాగా మరోసారి నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చింది.
దుట్టా అల్లుడు వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివభరత్ రెడ్డి హైదరాబాదులో డాక్టర్ గా పని చేస్తూ ఒక్కసారిగా ఆ వృత్తిని పక్కనపెట్టి గన్నవరం కి వచ్చేశారు. దీంతో ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రాంచంద్రరావు వర్గం వర్సెస్ శివ భరత్ రెడ్డి అన్నట్టు పరిస్థితిలు మారాయి. అంతేకాకుండా హైదరాబాద్ నగరం నుండి వచ్చిన డాక్టర్ శివభరత్ రెడ్డి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడని… గన్నవరం నియోజకవర్గంలో వార్తలు వస్తున్నాయి.
కాగా ఎన్నికల టైంలో అంతేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయములో వల్లభనేని వంశీ వర్గం వల్ల ఎవరైతే నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యకర్తలు నష్టపోయారో…ఇప్పుడు వారంతా శివభరత్ రెడ్డి వెనకాల ఉన్నారట. దీంతో ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో పార్టీలు పక్కనబెడితే వంశీ వర్సెస్ శివభరత్ రెడ్డిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు పంచాయతీ వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందట. కాబట్టి ఈ విషయంలో సీఎం జగన్ చొరవ తీసుకొని వైసీపీ క్యాడర్ కి తగిన న్యాయం చేయాలనే డిమాండ్ వినబడుతుంది.