Vallabhaneni Vamsi: చంద్రబాబు(Chandrababu) తలపెట్టిన 36 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో మాజీమంత్రి టీడీపీ(Tdp) నాయకురాలు పరిటాల సునీత(Paritala Sunitha) సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. కొడాలి నాని అదే రీతిలో వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలోని నాయకులు గా తయారయ్యి.. ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని.. ఇదే క్రమంలో రాజకీయ జీవితం ఇచ్చిన నాయకుల పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కచ్చితంగా రాబోయే ఎన్నికలలో వల్లభనేని వంశీ, కొడాలి నాని(Kodali Nani) ఓడిపోవడం గ్యారంటీ అని తెలిపారు. వాళ్లు తమపై మాట్లాడుతున్న దానికంటే ఎక్కువగా మాట్లాడే సత్తా తమకు ఉందని కానీ చంద్రబాబు మా నోరు నొక్కేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు తన భర్తను చంపిన అప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు. కాబట్టే ఉన్నాము ఇలాగే పరిస్థితులు ఏమీ మారవు చంద్రబాబు మారాలి అని పరిటాల సునీత సూచించారు. ఈ తరుణంలో పరిటాల సునీత తనపై చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్పందించారు. నిజంగా నారా లోకేష్(Lokesh) కి దమ్ము ధైర్యం మగతనం ఉంటే.. గన్నవరం నుండి పోటీ చేయాలని.. సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల దాకా ఎందుకు ఇప్పుడే తాను రాజీనామా చేస్తానని.. లోకేష్ నీ .. గన్నవరం లో పోటీ చేయించి.. వదిన పరిటాల సునీత యో.. లేదా లోకేష్ చంద్రబాబును.. ప్రచారానికి తెచ్చుకోవచ్చని గెలిపించుకునే ప్రయత్నాలు చేయాలని సవాల్ విసిరారు. ఎన్ని విమర్శలు చేసినా గాని తాను పరిటాల సునీతను వదిన గానే భావిస్తాను అని చెప్పుకొచ్చారు. అటువంటి వదిన సునీతకు… ఇప్పుడు తనపై ఎందుకు అంత కోపం వచ్చిందా అర్థం కావడం లేదని తెలిపారు.
వైసీపీ కి సపోర్ట్
పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని ని ఎందుకు ఓడించలేక పోయారని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిన స్క్రిప్టుని పరిటాల సునీత చదివి వినిపిస్తున్నారని.. వ్యాఖ్యానించారు. దీక్షలో చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే.. సాయంత్రం పడుకుంటే పొద్దున్న ఉన్నాడా లేదా అని చెయ్యిపట్టుకుని.. చూడాల్సిన పరిస్థితి వయసులో ఉన్నారని.. పేర్కొన్నారు. ఎటువంటి వ్యక్తుల మధ్యన గొడవలు పెట్టే టాలెంట్ చంద్రబాబు కి ఉందని.. ఆఖరికి తల్లి కడుపులో ఉండే శిశువుకు తల్లి కి మధ్య కూడా గొడవ పెట్టగలిగే సమర్ధుడు చంద్రబాబునాయుడు అని అన్నారు. అంత మాత్రమే కాక గన్నవరానికో గుడివాడకో… తాము మొదటి వాళ్ళము కాదు చివరి వాళ్ళను కాదని పేర్కొన్నారు. వంశీ 2019 ఎన్నికలలో..టీడీపీ తరపున గన్నవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీ కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని వల్లభనేని వంశీ అప్పట్లో విమర్శించడం తెలిసిందే. సాంకేతికంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న కానీ వైఎస్ జగన్ కి సపోర్ట్ చేస్తూ.. వైసీపీలో రాణిస్తున్నారు.
తమ ఒంట్లో కూడా సీమ రక్తమే….
ఈ క్రమంలో చాలా సందర్భాలలో చంద్రబాబుని నారా లోకేష్ ని… వంశీ విమర్శించటం జరిగింది. దీంతో వంశీకి లైఫ్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను తిడుతూ ఉండటంతో పరిటాల సునీత.. ఇటీవల నిరసన దీక్షలో స్పందిస్తూ.. చంద్రబాబు గంట కళ్ళు మూసుకుంటే తాను ఏమిటో నిరూపిస్తమని తెలియజేశారు. అంత మాత్రమే కాక నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ కి తగిన బుద్ధి చెబుతామని తమ ఒంట్లో కూడా సీమ రక్తమే.. ప్రవహిస్తుందని స్పష్టం చేశారు. ఎంతసేపు ఓర్పుగా ఉంటే సరిపోదు అని చంద్రబాబు మారాలని సూచించారు. ఈ క్రమంలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారని.. అయినా గాని గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పోటీకి దిగాలని… తాను రాజీనామా చేయడానికి సిద్ధమే అని… పేపర్ పై సంతకం పెట్టి.. ప్రముఖ టీవీ చానల్ ప్రతినిధి కి ఇచ్చి దానిపై తాను రాజీనామా చేస్తున్నట్లు పరిటాల సునీత రాశి స్పీకర్ కీ ఇవ్వాలని ఎన్నికలకు లోకేష్ రావాలని.. వంశీ చాలెంజ్ విసిరారు.