Vamanrao Murder case : ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు న్యాయవాదులు అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.. న్యాయవాది వామనరావు, ఆయన భార్య నాగమణి ని రోడ్డుపై అతికిరాతకంగా హత్య చేసి చంపేశారు.. తాజాగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది.. న్యాయవాది దంపతుల హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ హత్యకేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోంది అని సీజే ధర్మాసనం పేర్కొంది..
వామన్ రావు తండ్రికి ఎంత బాధ ఉందో ఈ కోర్టుకు అంతే బాధ ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు సరైన దిశలోనే సాగుతుందని హైకోర్టు తెలిపింది. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే సమయం వృధా అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. వామన్ రావు, నాగమణి హత్యల దర్యాప్తుపై న్యాయస్థానంలో నివేదిక సమర్పించారు పోలీసులు. అంతేకాకుండా నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 25 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు తెలిపారు. కొండ శీను, చిరంజీవిలను సాక్షులుగా గుర్తించే ప్రక్రియ పూర్తి చేశామని పోలీసులు చెప్పారు. సీసీటీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ ఎస్ ఎల్ కి పంపించమని చెప్పారు. నిందితులు వాడిన మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని , ప్రత్యక్ష సాక్షులకు పోలీసు భద్రత కల్పించమని వివరించారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణికుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ కేసులో ఏడు నిందితులను కూడా అరెస్టు చేశామని చెప్పారు. పోలీసులు చెప్పే విషయాలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.