మహేష్ కెరీర్ లో మైల్ స్టోన్ లాంటిన్ సినిమా మహర్షి. ఈ సినిమా మహేష్ కెరీర్ లో 25 వ సినిమా గా వచ్చింది. ఈ సినిమా తో మహేష్ బాబు కి సూపర్ హిట్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి. ఈ భారీ హిట్ ఇవ్వడం కోసం వంశీ పైడిపల్లి దాదాపు 3 ఏళ్ళు స్క్రిప్ట్ మీద కష్టపడ్డాడు. ఇదంతా మహేష్ ని విపరీతంగా ఇంప్రెస్ చేసింది. అందుకే మహర్షి తర్వాత మరో సినిమా చేద్దామని వంశీ కి మాటిచ్చాడట మహేష్ బాబు. అందుకు వంశీ కొన్ని నెలలు పాటు కూర్చొని స్క్రిప్ట్ సిద్దం చేశాడు.
మహేష్ బాబు అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నప్పుడు కూడా మహేష్ నెక్స్ట్ సినిమా వంశీ తోనే ఉండబోతోందని .. దిల్ రాజు నిర్మాత అని ప్రచారం జరిగింది. అంతేకాదు పాయింట్ మహేష్ కి నచ్చే పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్దం చేయమని చెప్పాడట. అయితే అనూహ్యంగా సరిలేరు సినిమా తర్వాత మహేష్ కి స్క్రిప్ట్ వినిపించిన వంశీ ఇంప్రెస్ చేయలేకపోయాడు. దాంతో నిర్మొహమాటంగా మహేష్ బాబు వంశీ కి నో చెప్పేశాడు.
అయితే మరో కథ రెడీ చేసి ఒప్పించాలని వంశీ ట్రై చేసినప్పటికి ఈ లోపు మహేష్ రెండు ప్రాజెక్ట్స్ కమిటైపోయాడు. త్వరలో సర్కారు వారి పాట సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా ఆ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చేయబోతున్నాడు. కొన్నేళ్ళుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకి ఇంతకాలానికి మొదలవబోతోంది. ఒకేవళ కాస్త ఎక్కువ గ్యాప్ వస్తే ఈ గ్యాప్ లో పూరి కథ నచ్చితే పూరి తో ఒక సినిమా చేస్తాడని టాక్.
ఈ లెక్కన ఖచ్చితంగా వంశీ తో మహేష్ సినిమా చేసే ఛాన్సెస్ చాలా తక్కువని అంటున్నారు. ఇక రాం చరణ్ తో చేయాలనుకున్నప్పటికి చరణ్ కూడా అంత ఆసక్తిగా లేడని సమాచారం. మొత్తానికి మహర్షి తర్వాత వేరేలా ఊహించుకున్న వంశీ ప్లాన్ అన్ని తారుమారవడం షాకింగ్ విషయమే.