స్వార్థం తెలియని అమాయకత్వం… మాటలో కల్మషం లేని తనం…. సమాజంలోని అసమానతల మీద ఉక్రోషం.. దాన్ని పాటలుగా మలచి ఊళ్ళకు ఊళ్ళను ఊపేసిన వంగపండు… మా గుండెలను పిండెస్తూ… వెళ్ళిపోయావా… ఏం పిల్లడో వెళ్ళిపోయినావ్ …!!
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. వందలాది జానపదపాటలను రచించిన వంగపండు ప్రసాదరావు.
ఉత్తరాంధ్రను ఊపేసిన ఆయన పాట…!!
ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి పాడిన వంగపండు. పల్లెకారులతో పాటు గిరిజనులనూ చైతన్యపరిచారు.
విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందారు. 1943లో పెదబొండపల్లిలో జన్మించిన ఆయన, అర్థరాత్రి స్వతంత్య్రంతో సినిమాతో సినీ లోకంలోకి అడుగు పెట్టారు. 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు. 1972లో జననాట్యమండలిని స్థాపించారు. మూడు దశాబ్ధాలలో సుమారు 350 పాటలు రచించిన ఆయన.., ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో బాగా ఖ్యాతి గాంచారు. ఆయన పాటలు ఇతర భాషల్లోకి కూడా అనువాదమై ప్రాచుర్యం పొందాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?