టీడీపీ తరుపున బలంగా మాట్లాడేవారిలో వర్ల రామయ్య ఒకరు! టీడీపీ అధినేతపై ఒక్క మాటకూడా పడనివ్వకుండా జాగ్రత్త తీసుకోవడంలో ముందుండే వర్ల రామయ్యను… తాజాగా చంద్రబాబు.. రాజ్యసభ బరిలోకి దింపిన సంగతి తెలిసిందే! ఆ విషయాన్ని బలిపశువును చేయడంగానే అధికార పక్షం, రాజకీయ విశ్లేషకులతో పాటు దళిత సంఘాలు అభిప్రాయపడుతున్నాయి! ఈ క్రమంలో గతకొన్ని రోజులుగా ఎస్సీ, బీసీలకు జగన్ వ్యతిరేకి అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమని.. వారి ఆత్మాభిమానంతో ఆడుకునేది చంద్రబాబు అని.. ఈ ఎన్నికలో వర్ల ను నిలబెట్టడం అందుకు నిదర్శనమనై కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వర్ల కూడా హర్టయ్యారని తెలుస్తోంది!
రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేదని తెలిసినా కూడా తనను నిలబెట్టి, బలిపశువును చేసి తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని వర్ల ఫీలవుతున్నట్లు తెలుస్తుంది. ఒకరిద్దరు తన సన్నిహితుల దగ్గర ఈ మేరకు వర్ల రామయ్య బాగా ఫీలయ్యారని… గెలిచే సమయంలో తన సామాజిక వర్గం వారిని, ధనవంతులను, వ్యాపారవేత్తలను నిలబెట్టిన చంద్రబబు… కచ్చితంగా గెలెవము అనుకున్న సమయంలో తన ఆత్మాభిమానంతో ఆడుకున్నారని అంటున్నారట! ఈ క్రమంలో పార్టీకి రాజినామా చేయాలని కూడా వర్ల భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
కాగా… దళితుడైన వర్ల రామయ్యను, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలోకి దింపడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా మండిపడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం వర్ల రామయ్యను బలిపశువును చేశారని.. చంద్రబాబు ఇకనైనా ఈ కుల రాజకీయాలు మానుకోవాలని ఆమె సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు క్యాష్ ముఖ్యమని భావించిన చంద్రబాబు… ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని రోజా మండిపడ్డారు!