ప్రస్తుతం బుల్లితెర మీద క్రేజీ జంట ఎవరైనా ఉన్నరంటే.. అది వర్ష, ఇమ్మాన్యుయేల్ మాత్రమే. ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీ జంట అంటే ఫుల్లు క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆ క్రేజ్ కాస్త… వీళ్లమీదికి షిఫ్ట్ అయింది.
వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి జబర్దస్త్ లో స్కిట్ చేస్తే చాలు.. ఆ స్కిట్ హిట్టే. ఆ జంటకు ఎంత క్రేజ్ ఉందో.. ఇమ్ముకు ఒక్కడికి కూడా అంతే క్రేజ్ ఉంది.
ఇక.. ఈ జంటకు క్రేజ్ ఉంటే.. ఊరుకుంటారా? వెంటనే అన్ని ప్రోగ్రామ్స్ కు వీళ్లను పిలిచేయడం స్టార్ట్ చేశారు. తాజాగా వీళ్లిద్దరు సుమక్క క్యాష్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో జంటగా వర్ష, ఇమ్ము సందడి చేశారు.
షోలో భాగంగా.. సుమ.. ఓ ప్రశ్న అడుగుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఎంతశాతం మంది వారి పార్ట్ నర్ కళ్లతోకి చూస్తూ కాలం గడుపుతారు? అని అడగగానే.. వామ్మో.. నిజంగా ప్రేమిస్తే.. వాళ్ల కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేం. నా వల్ల అయితే కాదు. నేను నిన్ను ఎప్పుడైనా కళ్లలోకి కళ్లు పెట్టి చూశానా? అంటూ ఇమ్మూను అడిగింది వర్ష.
అంటే.. వీళ్లిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందన్నమాట.. అనే విషయం ప్రేక్షకులకు అర్థం అయిపోయింది. ఇదేదో.. సుధీర్, రష్మీలా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ లో కూడా ఇమ్ము, వర్ష మధ్య ఏదో జరుగుతోంది.. అనే విషయం ఈ షోతో బయటపడిపోయింది.