ఈ మధ్యకాలంలో జబర్దస్త్ వేదికపై తళుక్కుమని మెరిసిన తార వర్ష. హైపర్ ఆది స్కిట్ లో ఫేమస్ అయిన వర్ష ఆ తర్వాత ఇమాన్యుల్ కు జోడిగా స్కిట్లు చేసి అందరినీ అలరిస్తుంది. ప్రస్తుతం రాకింగ్ రాకేష్ టీం లో తన అందాలను ప్రదర్శిస్తూ ఒక్కసారిగా బుల్లితెర ప్రేక్షకుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇక ఇమాన్యుల్ తో కలిసి చేసిన స్కిట్ లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఫార్ములా బాగా వర్కౌట్ అయింది. రోజా కూడా ఫుల్లు సెటైర్లు వేయడం తో వర్ష బాగా పాపులారిటీ తెచ్చుకుంది.
ఇంతకుముందు అభిషేకం, ప్రేమ ఎంత మధురం, తూర్పు-పడమర వంటి ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో నటించిన వర్ష కు అప్పుడు రాని క్రేజ్ జబర్దస్త్ వల్ల వచ్చింది. ఈ ఓవర్ నైట్ స్టార్ డం ను ఎంజాయ్ చేస్తూనే కొన్ని తలనొప్పులు కూడా వాటితో పాటు వచ్చాయి. వర్ష ఫేమస్ అయిపోగానే గతంలో మాట్లాడిన వీడియో లను వైరల్ చేయసాగారు. ఒక సందర్భంలో అనసూయ సెల్ఫీ అడిగాడని ఒక అబ్బాయి ఫోన్ పగలగొట్టిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. అది దాదాపు 3-4 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన.
అప్పట్లో వర్ష ఒక వీడియో విడుదల చేసింది. అనుసూయను ఘోరంగా అవమానించింది. ఆ వీడియోలో మాట్లాడుతూ అనసూయకు కూడా పిల్లలు ఉన్నారు కదా వాళ్లు ఎవరితోనైనా పెద్ద హీరోలతో సెల్ఫీ ప్రయత్నిస్తే వారు కూడా ఆ పిల్లలు ఫోన్ను పడేస్తే ఆమె ఎలా ఫీల్ అవుతోందో అవతలి వ్యక్తి కూడా అలాగే ఫీలవుతారు కదా అని అనసూయ పరువు తీసేలా మాట్లాడింది.
అయితే అప్పుడు ఆ వీడియో ని ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు దానికి వర్ష క్లారిటీ ఇచ్చింది. అప్పుడు అనసూయ గారి గురించి తెలియక మాట్లాడాను. రంగస్థలం షో చేస్తున్నప్పుడు ఆమెకు క్షమాపణలు చెప్పాను…. ఆమె చాలా కూల్ గా మాట్లాడింది అని చెప్పింది… తప్పు నాదే అని కూడా ఒప్పుకుంది. నా గురించి తెలియకుండా మాట్లాడవు కదా అని అనసూయ లైట్ తీసుకుంది అని చెప్పుకొచ్చింది.