ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా మరో ఎమ్మెల్యే ఆ దిశగా అడుగులు వేశారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీని వీడనున్నారు.
ఈరోజు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ విజయసాయి రెడ్డి గణేష్ ను వెంటబెట్టుకుని వచ్చారు. గత కొంత కాలం నుండి వాసుపల్లి గణేష్ టీడీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలతో గత కొంత కాలం నుండి చర్చలు జరుపుతున్నారు. అయితే పార్టీ మారే విషయంపై ఆయన ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదు. 2014, 2019లో వరసగా విశాఖ దక్షిణ నుండి టిడిపి తరుపున పోటీ చేసి విజయం సాధించారు వాసుపల్లి గణేష్.