కరోనా వైరస్ వల్ల తగ్గిపోయిన రెవెన్యూను పెంచడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. అయితే దీనికోసం సామాన్యుడి నడ్డి విరగ్గొట్టే చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు కరోనా వైరస్ దారుణమైన దెబ్బ అనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు నెల తిరిగేసరికి జీతాలు కూడా సమయానికి చెల్లించలేనంత.
అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్య, సామాన్యుడికి షాక్ అనే చెప్పాలి. వంట గ్యాస్ మీద వ్యాట్ శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న 14.5 శాతం నుండి 24.5 శాతం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వంట గ్యాస్ ధరలు పెరగనున్నాయి. ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటగా వంట గ్యాస్ ధరలను పెంచింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?