వస్తువుల ధరలు పెరుగుతున్న కారణంగా వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి.. ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గత వారం లోనే తన కార్లు, కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.. ఇప్పుడు జనవరి నుండి ట్రాక్టర్ ధరలను కూడా పెంచనున్నట్లు తెలిపింది..
ట్రాక్టర్ అమ్మకాలలో కంపెనీ బలమైన వృద్ధిని సాధించింది. ఈ 2020 నవంబర్ నెలలో 31,619 యూనిట్లను విక్రయించింది. 2019 నవంబర్ నెలలో 20,414 యూనిట్లను విక్రయించింది. దీని బట్టి మహింద్రా 50 శాతం వృద్ధి రేటు పెరిగింది. ఇది కంపెనీ యొక్క అమ్మకాలలో మంచి పెరుగుదల. జహీరాబాద్లోని కంపెనీ లో మహీంద్రా నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా యువో, జీవో ట్రాక్టర్ లను ఉత్పత్తి చేస్తుంది. ఒకేసారి మార్కెట్లో ఈ రెండు విడుదలైన కూడా అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ ఆశిస్తోంది.
కొత్త కె సిరీస్ ట్రాక్టర్లను తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ లో అదనంగా రూ.100కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వ్యవసాయ రంగంలో రైతులకు ఎంతగానో ఉపయోగపడే ట్రాక్టర్లకు ఇటీవల కాలంలో మంచి ఆధారంతో పాటు మంచి అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. 2024 నాటికి తన ట్రాక్టర్ ప్లాంట్ లో ఉపాధిని రెట్టింపు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ట్రాక్టర్ ల ధర పెరుగుతుందని సమాచారం వెల్లడించలేదు. కానీ ధరల పెరుగుదల మాత్రం కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి మహింద్రా సిద్ధమవుతోంది. న్యూ జనరేషన్ ఆఫ్ మహీంద్రా ఎక్స్యూవీ 500 ఎస్యూవీని రాబోయే సంవత్సరంలో విడుదల చేయనుంది. కొత్తతరం ఎక్స్యూవీ భారతీయ వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది. దీని కోసం యాక్స్సరీస్ ప్యాకేజిని కూడా కంపెనీ ప్రకటించింది.