వెల్లూరు : తమిళనాడులోని వెల్లూరు లోక్సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆ నియోజక వర్గంలో ఇటీవల భారీగా నగదు పట్టుబడిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఏప్రిల్ 14న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రతిపాదనలు పంపింది. ఇందుకు మంగళవారం రాష్ట్రపతి అంగీకరించడంతో అక్కడ ఎన్నిక రద్దయింది.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను శాఖ తనిఖీల్లో స్థానిక డిఎంకె అభ్యర్థి కాదిర్ ఆనంద్ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడింది. దాదాపు 11 కోట్ల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లూరు లోక్సభ ఎన్నికల రద్దుకు సిఫార్సు చేస్తూ ఢిల్లీలోని అధికారులకు లేఖ రాసింది. అలాగే అభ్యర్థి ఆనంద్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన నేరం కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల రద్దు చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం భారత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు చేరవేసింది.
వెల్లూరు లోక్ సభ స్థానానికి గురువారం(ఏప్రిల్ 18 ) ఎన్నిక జరగాల్సి ఉన్నది.