మరో రెండేళ్ళలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ అత్యున్నతమైన రాజ్యాంగ పదవికి బీజేపీ సర్కార్ మనసులో ఏమనుకుంటుందో.. ఎవరినీ అనుకుంటుందో ప్రస్తుతానికి సస్పెన్స్ అయిన తరుణంలో… ఉప రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి కావడం అంటే అది సంప్రదాయం ఉందంటే ఉంది.. లేదంటే లేదు.. కాబట్టి.. నెక్స్ట్ వెంకయ్య నాయుడే అనే చర్చ కూడా సాగుతుంది! ఇది తెలుగువారంతా పార్టీలకు అతీతంగా గర్వించాల్సిన విషయమే! అయితే.. వెంకయ్య ప్రథమ పౌరుడు అవ్వాలనే విషయంలో జగన్ కీలకం కాబోతున్నారనేది ఇక్కడ పాయింట్!
వాస్తవానికి 2014కి ముందు బీజేపీ అధికారంలోకి వస్తే.. వాజ్ పేయి అనంతరం సీనియర్ అయిన ఎల్.కే. అద్వానీకే ప్రధాని పదవి అని అప్పట్లో టాక్ నడిచింది. కానీ.. మోడీ మానియాలో అది కనుమరుగైపోయింది. అనంతరం మొడీ పీఎం అయిన తర్వాత అద్వానీని రాష్ట్రపతి చేస్తారని కూడా కథనాలొచ్చాయి… కాని ఎవరూ ఊహించని విధంగా రాంనాధ్ కోవింద్ పేరు తెరపైకి వచ్చింది. అయితే మరో రెండేళ్లలో కొత్త రాష్ట్రపతి రావాల్సి ఉంది కాబట్టి.. ఇప్పటి నుంచే ఈ విషయంపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో వెంకయ్య నాయుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోందని అంటున్నారు!
తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకుడు అయిన వెంకయ్య నాయుడు. ఎందుకంటే… రాష్ట్రపతులు అంతా అప్పటికి అధికారంలో ఉన్న పార్టీల బలాలు, వారి ఆలోచనల బట్టి ఎంపిక చేయబడతారు. ఈ లెక్కన చూసుకుంటే వెంకయ్యకు ఎన్.డీ.ఏ రూపంలో మాంచి బలమే ఉంది కానీ… అప్పటికి ఎంతమంది వెంకయ్యను సపోర్ట్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఈ విషయంలో అన్నింటికంటే ప్రధానంగా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ చాలా కీలకం కాబోతోందని అంటున్నారు!
ప్రెసిడెంట్ ఎలక్ట్రోరల్ కాలేజ్ లో… 151 మంది ఎమ్మెల్యేలు, రెండు సభలు కలుపుకుని 28 మంది ఎంపీలతో వైసీపీకి భారీగానే ఓట్లు ఉన్నాయి. ఇక ప్రతిపక్ష టీడీపీ విషయానికొస్తే… ముగ్గురు లోక్ సభ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ సభ్యుడు, ప్రస్తుతానికి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు! దీంతో రాష్ట్రపతి పదవికి బీజేపీ కనుక వెంకయ్య పేరు ప్రస్థావిస్తే మాత్రం జగన్ కీలకంగా మారబోతున్నారన్నమాట!!