(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబీసీ)కు ప్రభుత్వం నూతన చైర్మన్ను నియమించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ విబి సాయి కృష్ణ యచేంద్ర ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సినీ నటుడు పృధ్విరాజ్ ఎస్వీబీసీ చైర్మన్గా నియమితులైయ్యారు. అయితే ఫృధ్విపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ చైర్మన్ రేసులో ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న, వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడు శ్రీనివాసరెడ్డి పేర్లు తెరపైకి వచ్చినా ప్రస్తుతం వారు ఇద్దరు డైరెక్టర్లుగా ఉండటంతో సీఎం వైఎస్ జగన్ వారి పేర్లు పరిశీలనలోకి తీసుకోలేదని సమాచారం.
పృధ్విపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తిరుమలలో పదవుల ఏంపిక విషయంలో చాలా జగ్రత్తలు పాటించాలనీ, ఎలాంటి పొరపాట్లకు తావు ఉండకూడని సీఎం జగన్ భావించారు. ఈ క్రమంలో వివాద రహితుడైన వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సాయి కృష్ణ యచేంద్రను ఎస్వీబీసి చైర్మన్ పదవికి ఎంపిక చేశారు.