Venkatesh : వెంకటేష్ కి టాలీవుడ్ లో రీమేక్ కింగ్ అన్న పేరుంది. సొంత బ్యానర్ తో పాటు సూపర్ గుడ్ ఫిలింస్ అన్న పెద్ద బ్యానర్ లో పలు తమిళ సినిమాల రీమేక్ లో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. టాలీవుడ్ లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసి హిట్ అందుకున్న హీరోలలో వెంకటేష్ ఫస్ట్ ఉంటాడు. రాజా, వసంతం, గురు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు పరభాషా చిత్రాలే. వెంకీ కూడా కథ నచ్చితే వెంటనే రీమేక్ చేసేందుకు రెడీ అయిపోతాడు. ఇప్పుడు తాజాగా వెంకటేష్ నటించిన నారప్ప కూడా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమాకి రీమేక్. కోలీవుడ్ లో ధనుష్ నటించగా 100 కోట్ల కి పైగా వసూళ్ళు సాధించింది.
దాంతో ఈ సినిమా రీమేక్ చేశాడు సురేష్ బాబు. కలైపులి ఎస్ థాను తో కలిసి సంయుక్తంగా నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ప్రియమణి హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా మే 14 న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. ఇక వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్ 3 లో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తుండగా తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.
Venkatesh : ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకే వెంకటేష్ దృశ్యం 2 లో నటించడానికి నో అన్నాడట..?
కాగా రీసెంట్ గా దృశ్యం 2 సినిమా ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 19 న విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమా తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు దృశ్యం 2 లో కూడా వెంకటేష్ నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కాని వెంకటేష్ దృశ్యం 2 లో నటించడం లేదని చెప్పినట్టు సమాచారం. అందుకు కారణం దృశ్యం 2 ఓటీటీలో రిలీజ్ కాబోతుండటమే. ఫిబ్రవరి 19 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతోంది. ఇలా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకే వెంకటేష్ సీక్వెల్ లో నటించడానికి నో అన్నాడని తెలుస్తోంది.