Venkatesh : మలయాళంలో సెన్సేషనల్ హిట్ సాధించిన సినిమా దృశ్యం.. ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు మరో మూడు భాషల్లో రీమేక్ చేశారు.. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది తాజాగా ఈ సినిమా సీక్వెల్ ను మరోసారి మలయాళంలో తెరకెక్కించారు.. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.. తాజాగా “దృశ్యం 2” లో విక్టరీ వెంకటేష్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..ఈ సినిమాకి మాతృక డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు..
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే దర్శకుడు హైదరాబాద్ లో ప్రారంభించటానికి , ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్స్ ని కూడా వెతుకుతున్నారట. ఈ సీక్వెల్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.సురేష్ బాబు నిర్మించనున్నారట. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి త్వరలోనే థియేటర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.