భారత మార్కెట్లోకి రోజుకో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి.. అయితే గ్రీన్ నగరాలుగా మార్చడానికి ఇవి ఎంతగానో ఉపయోగం.. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బైక్స్.. రోజురోజుకి మార్కెట్లో ప్రజాదరణ పొందుతున్నాయి.. ఈ నేపధ్యంలోనే తయారీ సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి.. అయితే కొత్త స్టార్ట్ అప్స్ తో పాటు పెద్ద కంపెనీలు సైతం వీటిని తయారీపై దృష్టి పెట్టాయి.. తాజాగా పియాజ్జియో సంస్థ భారత్ లో వెస్ప ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తుంది.. ఈ బైక్ ఫీచర్స్, ఇంజన్ సామర్ధ్యం, పూర్తి వివరాలు ఇలా..
ఫీచర్లు :
4.3 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లూటూత్-స్మార్ట్ ఫోన్ కనెక్టువిటీ ఈ బైక్ సొంతం. 4 కిలోవాట్ల లైట్స్ బ్రష్లెస్ డిసి ఎలక్ట్రిక్ మోటార్, 200 నానో మీటర్ల అధికంగా ఉత్పత్తి అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు రైడ్ చేయవచ్చు. ఒక ఛార్జింగ్ కు నాలుగు గంటలు పడుతుంది. రౌండ్ హెడ్ లాంప్, కర్వీ ఫ్రంట్ ఆఫ్రన్, ముందు కాంట్రాక్ట్ కలర్ ఎయిర్ మెంట్లు, యాప్రాన్ మౌంటెడ్ ఇండికేటర్స్ తో దీన్ని రూపొందించారు. క్లీన్ డిజైన్ తో ఉన్న సైడ్ ప్యానెల్స్, వెనుకభాగంలో స్పోర్ట్స్ ఎల్ఈడి టై లైట్, అల్లాయ్ వీల్స్, కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
పియాజ్జియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డియెగో గ్రాఫీ మాట్లాడుతూ కేవలం భారత వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ స్కూటర్ టూవీలర్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ స్కూటర్ డిజైన్, టెక్నాలజీని తమ సంస్థ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. టూవీలర్ పవర్ ట్రైన్ టెక్నాలజీను వెండర్ల నుంచి తీసుకోలేదని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ స్కూటర్లు యూరప్ లో విడుదలయ్యాయని వివరించారు.. దీన్ని ఎప్పుడు విడుదల చేస్తారని వివరాలను ఆ సంస్థ అధికారికంగా వెల్లడించలేదు వచ్చే సంవత్సరం ఈ బైక్ ఇండియా లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి..