Raghu Ramakrishnam Raju: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. చాలా వరకు ప్రభుత్వం ఇరకాటంలో పెట్టే రీతిలో ప్రతి పక్షాలు పెగసాస్ స్పైవేర్, రైతు చట్టాలు గురించి చర్చలు జరపాలని సభలో ఆందోళనలు నిరసనలు చేపడుతున్నాయి. చాలా వరకు మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రీతిలో ఉభయ సభలలో విపక్షాలు ఆందోళనలు నిరసనలు చేపడుతున్నాయి.
ఇటువంటి తరుణంలో కేంద్రం సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ వ్యవహరించడానికి.. సభ జరిపించడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటుంది. మరోపక్క వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టం హామీలు అమలు చేయాలని ప్రత్యేక హోదా ఇంకా విశాఖ రైల్వేజోన్ పోలవరం నిధులు వంటి విషయాలపై వెల్లోకి వెళ్లి ఆందోళనలు చేస్తున్నారు. పార్లమెంట్లో నాలుగో ఎక్కువ పార్లమెంట్ సభ్యులు కలిగిన పార్టీ కావడంతో ఇటీవల కేంద్ర పెద్దలు ఢిల్లీకి వైయస్ జగన్ కూడా వార్తలు వచ్చాయి.
పరిస్థితి ఇలా ఉన్న తరుణంలో కేంద్రం చాలావరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న టు.. వార్తలు వస్తున్న తరుణంలో వైసీపీ ఎంపీలు తాజాగా రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. విషయంలోకి వెళ్తే టీవీ ఫైవ్ చైర్మన్ బి ఆర్ నాయుడు.. రఘురామకృష్ణల మధ్య 10 కోట్ల మేర అక్రమ లావాదేవీలు.. జరిగినట్లు.. మోడీ కి ఆధారాలతో కూడిన లెటర్ రాశారు. దీంతో ఇటువంటి తరుణంలో.. ప్రధాని మోడీ వ్యవహారంపై ఏవిధంగా స్పందిస్తారో అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ రీతిగా వైస్సార్సీపీ ఎంపీలు ఒకపక్క పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వెన్నుపోటుదారులకు..మరోపక్క రాష్ట్ర ప్రయోజనాలకోసం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో దూకుడుగా రాణిస్తున్నారు.