బెంగళూరు: బాకీ తీర్చలేదని ఒక మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చామరాజనగర్ జిల్లా కొలిగల్ ప్రాంతానికి చెందిన రాజమణి ఒక చిన్న హోటల్ నడుపుతూ ప్రైవేటు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పలువురికి 50వేల వరకూ బాకీ పడింది. ఈ బాకీ తీర్చడంలేదని వారు ఆమెను కోడిగేహల్లిలో విద్యుత్ స్తంబానికి కట్టేసి చిత్రహింసలు పెట్టారు. ‘ఆమెకు బుద్ది వచ్చేలా చెప్పు తీసుకుని కొట్టండి’ అని వారు అనడం వీడియోలో రికార్డు అయ్యింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
వీడియో కోసం కింద క్లిక్ చేయండి (ఎఎన్ఐ సౌజన్యంతో)..
#WATCH A woman was tied to a pole in Kodigehalli, Bengaluru, yesterday, allegedly for not repaying a loan she took. Police have arrested 7 people in connection with the incident. #Karnataka pic.twitter.com/jpwX3Cr0Gu
— ANI (@ANI) June 14, 2019