సౌతిండియా టాప్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నా… ఎవ్వరికీ తెలియకుండా మెయిన్ టెన్ చేశారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ చెట్టాపట్టేలేసుకొని తిరగడం అందరికంటా పడటంతో ఓపెన్ అప్ అయ్యారు.
ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారట. కాకపోతే పెళ్లిమాటను మాత్రం ఇద్దరూ ఎత్తడం లేదు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నా.. డేటింగ్ లో ఉన్నా.. నయన్ మాత్రం సినిమాల్లో నటిస్తూనే ఉన్నది.
ఇక.. కొన్నేళ్ల నుంచి డేటింగ్ రిలేషన్ షిప్ లో వీళ్లిద్దరు.. వాళ్ల మధ్య ఎటువంటి సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారట. అయితే.. నయన్, శివన్ ఇద్దరూ విడిపోయారు.. వాళ్లిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు.. అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిపై కూడా వీళ్లు ఏనాడూ స్పందించలేదు.
అంతే కాదు.. ఆ మధ్య ఇద్దరు కలిసి గ్రహ దోష పూజలను కూడా చేయించుకున్నారు. ఆ పూజకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
అయితే.. తాజాగా తమ పెళ్లిపై విఘ్నేష్ స్పందించాడు. మాకంటే ఎక్కువగా మీడియాకే మా పెళ్లి గురించి టెన్షన్. ఎప్పటికప్పుడు మా పెళ్లి గురించి ఏదో ఒక పుకారు వస్తూనే ఉన్నది. వస్తూనే ఉంటాయి. వాటిని మేము పట్టించుకోము. నా కెరీర్ లో నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రస్తుతం డేటింగే బాగుంది. డేటింగ్ బోర్ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడెందుకు పెళ్లి.. డేటింగ్ బోర్ కొట్టనంతవరకు పెళ్లి గురించి మేం ఆలోచించే సమస్యే లేదు.. అంటూ షాకిచ్చాడు విఘ్నేశ్.