సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న విషయం తెల్సిందే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సెలబ్రిటీలు అందరూ మొక్కలు నాటుతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మొక్కలు నాటి తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
అదే క్రమంలో మహేష్ ఈ ఛాలెంజ్ ను ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్, శృతి హాసన్ లను నామినేట్ సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే మహేష్ నామినేట్ చేసిన ఛాలెంజ్ ను ఒక్కరోజులోనే స్వీకరించాడు విజయ్. చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు విజయ్. ఇది నీ కోసమే మహేష్, ఆరోగ్యకరమైన జీవనానికి ఇది ఉపయోగపడుతుంది అని ట్వీట్ చేసారు విజయ్.