రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత కూడా చాలా సినిమాలలో నటించి హిట్ కొడుతూనే వున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరో గా ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చూపించడానికి రెడీ అయ్యాడు. లైగర్ మూవీలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, బాక్సింగ్ లెజెండ్ టైసన్ కీలక పాత్రలలో నటించారు. ఈనెల 25న లైగర్ సినిమా థియేటర్స్ లో రాబోతుండగా మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా వున్నారు.
రౌడీ బాయా మజాకా
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సరికొత్త డిమాండ్..!!
తాజాగా రౌడీ హీరో క్రేజ్కి ముంబైలోని ఒక షాపింగ్ మాల్ అంతా అభిమానులతో నిండిపోయింది. బాలీవుడ్ పై కన్నేసిన రౌడీ హీరో ముంబైలో లైగర్ మూవీ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్బంగా లైగర్ మూవీ హీరోయిన్ అనన్యతో కలిసి ఓ షాపింగ్ మాల్ కి వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆ షాపింగ్ మాల్ మొత్తం కొంచెం కూడా గ్యాప్ లేకుండా నిండిపోయారు. ఈ క్రమంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది.
విజయ్,అనన్య ఉన్న స్టేజీ వద్దకు వెళ్లాలని అభిమానులు బారు గేట్లను నెట్టడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ఈ ఘటన చూసి సెక్యూరిటీ సిబ్బంది హడలిపోయారు. అనంతరం కార్యక్రమం ముగియక ముందే మధ్యలోనే విజయ్, అనన్యలను అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత ముంబైలోని అభిమానుల కోసం ఒక నోట్ రాసాడు విజయ్ దేవరకొండ.
ముంబైలో ఫుల్ క్రేజ్
‘మీ ప్రేమ నన్ను తాకింది. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను మీ అందరితో చాలాకాలం ఉండాలనుకుంటున్నా. నేను వెళ్లేటప్పుడు మీ అందరి గురించి ఆలోచిస్తున్నాను.. గుడ్ నైట్ ముంబై’ అని రాసుకొచ్చాడు విజయ్. బాలీవుడ్ లో ఒక సినిమా కూడా తీయకుండానే మన టాలీవుడ్ హీరోకు ముంబైలో ఇంత క్రేజ్ ఎలా వచ్చిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నటి చార్మి ట్విట్టర్ వేదికగా పంచుకోగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?