Mahesh babu : మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి వచ్చి మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ – వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తాడని చెప్పుకున్నారు. మహేష్ బాబు కూడా ఈ విషయాన్ని ప్రకటించాడు. అయితే సరిలేరు తర్వాత మొదలవ్వాల్సిన ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది. అందుకు కారణం వంశీ పైడిపల్లి చెప్పిన స్క్రిప్ట్ మహేష్ కి నచ్చకపోవడమే.
ఇదే కథ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో వంశీ పైడిపల్లి చేయబోతున్నాడని మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి. కాని మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాని ప్రకటించాడు. చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఆచార్య సినిమా చేస్తుండగా ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమా చేయడాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఈ ఇద్దరు హీరోలతో వంశీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని అర్థమైపోయింది. ఇక రీసెంట్ గా మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా కి నేషనల్ అవార్డ్ వచ్చి హాట్ టాపిక్ అయ్యాడు.
Mahesh babu : విజయ్ దేవరకొండకి కథ నచ్చిందా లేదా..?
దాంతో మళ్ళీ వంశీ పైడిపల్లి కొత్త ప్రాజెక్ట్ కి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అయితే మహేష్ బాబు కోసం అనుకున్న కథ ఇప్పుడు విజయ్ దేవరకొండ దగ్గరకి వెళ్ళిందని సమాచారం. ఈ కథ తో వంశీ పైడిపల్లి విజయ్ దేవరకొండ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. మరి కథ విజయ్ కి నచ్చిందా లేదా .. ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకుడు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!