వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఓ రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో రెస్పాన్స్ దక్కించుకోవడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని పూరి జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.
అనన్య పాండే హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కారణం వల్ల లాక్ డౌన్ దెబ్బకి అని షూటింగ్ లతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగి పోవడం జరిగింది. అయితే ఇటీవల క్రేజీ ప్రాజెక్టులన్నీ ప్రారంభమైన క్రమంలో “లైగర్” ఇంకా స్టార్ట్ కాకపోవటంతో సోషల్ మీడియాలో అనేక డిస్కషన్స్ జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేయడమే కాక హైదరాబాద్ నుండి విజయ్ దేవరకొండ, నిర్మాతలలో ఒకరైన ఛార్మి బొంబాయి కి చేరుకోవడం జరిగింది.
ఈ తరుణంలో ఎమోషనల్ గా విజయ్ దేవరకొండ ఇంటికి దూరం కావడంతో తల్లి మాధవి దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆమె ఏమన్నారు అంటే.. ఈ ఏడాది అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. దీనికి స్పందించిన ఛార్మి లవ్యూ మాధవి.. మిస్సింగ్ యూ అంటూ పోస్ట్ పెట్టేసింది. కాగా గతవారమే చార్మీ విజయ్ దేవరకొండ ఇంట్లో డిన్నర్ చేయడం జరిగింది. మాధవి ఎంతో బాగా హోస్ట్ చేసిందంటూ డిన్నర్ పార్టీ గురించి చార్మీ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.