Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ దాదాపు సగం పూర్తయింది. 19 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా… ఏడుగురు ఎలిమినేట్ అవటంతో 12 మంది మిగిలారు. అయితే వీరిలో ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఆరుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా షో నిర్వాహకులు.. స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది. టిఆర్పి రేటింగులు..షోకి బాగా పడిపోవడంతో.. గత సీజన్లో కంటే మరీ దారుణంగా సీజన్ ఫైవ్ అట్టర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితిలో షో… రన్ అవ్వుతున్నట్లు.. బయట విపరీతమైన టాక్ నడుస్తూ ఉండటంతో… షో నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నట్లు దీనిలో భాగంగా దీపావళి పండుగ వేదికగా షో రూపురేఖలు మారిపోయే రీతిలో.. టాప్ సెలబ్రెటీలను రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే టాలీవుడ్(Tollywood) రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సీజన్లో దీపావళి(Diwali) సందర్భంగా అడుగుపెట్టడానికి రెడీ అయినట్లు సమాచారం. గతంలో విజయ్ దేవరకొండ సీజన్ 2లో… దీప్తి సునయన తో.. ఓ రేంజ్ లో గేమ్ ఆడాడు. అది అప్పట్లో మాత్రమే కాక ఇప్పటికికూడా హైలెట్ గా నిలిచింది. ఆ తరువాత సీజన్ త్రీ లో రాహుల్ సిప్లిగంజ్(Rahul Siplighanj)తో పాటు .. పునర్నవి తో విజయ్ దేవరకొండ(Vijaydeverakonda) ఆడిన గేమ్ ఇప్పటికి కూడా హైలెట్.
ఈ క్రమంలో సీజన్ ఫైవ్ లో కూడా అదేరీతిలో విజయ్ దేవరకొండ కి సూపర్ పవర్ …ఇచ్చి.. హౌస్ లోకి పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ.. ఆ సూపర్ పవర్ తో ఆ వారం ఎలిమినేషన్ నామినేషన్ లో ఉన్న తనకిష్టమైన కంటెస్టెంట్ నీ ఆదుకోవడానికి.. షో నిర్వాహకులు స్పెషల్ పవర్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో విజయ్ దేవరకొండ ఎవరిని సేవ్ చేశాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది. పరిస్థితి ఇలా ఉంటే విజయ్ దేవరకొండ హౌస్ లో ఇంటి సభ్యుల చేత భారీగా ఆడుకునే రీతిలో… షో ప్లాన్ చేసినట్లు మంచి ఎంటర్ టైన్ మెంట్.. ఉండే విధంగా చూసుకుంటున్నట్లు ఈ క్రమంలో… డైరెక్టుగా హౌస్ లోకి వెళ్లకుండా.. హౌస్మేట్స్ కి సెలబ్రిటీలకు మధ్య డోర్ గ్లాస్ ఏర్పాటు చేసినట్లు కరోనా కారణంగా షో నిర్వాహకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని సరికొత్త గేమ్స్.. దీపావళి సందర్భంగా ప్లాన్ చేసినట్లు..దీపావళి స్పెషల్ ఎపిసోడ్ షో మొత్తానికి హైలెట్ అయ్యే రీతిలో జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ లు
చాలావరకూ సీజన్ ఫైవ్ ప్రసారమవుతున్న సమయంలో ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో పాటు.. తాజాగా టి20 వరల్డ్ కప్ కూడా స్టార్ట్ కావటంతో.. షోకి మినిమమ్ రేటింగ్ కూడా నమోదు కాని పరిస్థితి ఉండటంతో.. షో నిర్వాహకులు సీజన్ ఫైవ్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్.. ఓ రేంజ్ లో ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఒక్క విజయదేవరకొండ మాత్రమే కాకుండా యాంకర్ సుమ అదేరీతిలో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ లు అరియనా, సోహైల్, ఇంకా చాలామంది గత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్ లు.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఎలాగైనా దీపావళి వేడుక మొదలుకొని.. భారీ ఎత్తున టిఆర్పి రేటింగులు నమోదు కావాలని షో నిర్వాహకులు కంకణం కట్టుకున్నారట. సగం సీజన్ పూర్తి కావడంతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకపోవటంతో.. మిగతా బ్యాలెన్సింగ్ రోజులు మొత్తం.. షో కి మంచి ఆదరణ దగ్గర జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. V