మాస్టర్ సినిమా ఎట్టకేలకి థియేటర్స్ లోకి వచ్చేసింది. కోలీవుడ్ ప్రేక్షకులు విజయ్ ఫ్యాన్స్ మాస్టర్ సినిమా కోసం దాదాపు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన master సినిమా కి సంబంధించి రక రకాల రూమర్స్ కూడా వచ్చి హాట్ టాపిక్ అయ్యాయి. vijay గత చిత్రాలకి మించి దర్శకుడు లోకేష్ కనగ రాజన్ మాస్టర్ సినిమాని తెరకెక్కించాడు. ఈ కారణంగానే vijay master సినిమా మీద ఊహకందనంతగా అంచనాలు పెరిగాయి. ఇక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి.. విజయ్ ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు రావడం పక్కా అన్న టాక్ కూడా ఉంది.
దానికి తోడు కోలీవుడ్ లో సూర్య, అజిత్, కార్తి, ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళతో పోటీ పడి గత కొంతకాలంగా vijay భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకుంటూ టాప్ లో నిలిచాడు. ఇప్పుడు vijay టార్గెట్ నంబర్ వన్ ప్లేస్ మాత్రమే కాదు .. పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ దక్కించుకోవడమే. అందుకే లోకేష్ కనగ రాజన్ తో విజయ్ పాన్ ఇండియన్ సినిమానే చేద్దామని కమిటయ్యాడు. ఆ రకంగానే master సినిమాని లోకేష్ కనగ రాజన్ పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించాడు.
కాగా ఎన్నో అవాంతరాలను దాటుకొని ఈరోజు థియేటర్స్ లోకి వచ్చిన master బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్ఠిస్తోంది. ఫ్యాన్స్ కి పూనకాలొస్తున్నాయి. ఇన్ని నెలల తర్వాత తమ అభిమాన హీరో సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూస్తున్న ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన master సినిమాని సూపర్ హిట్ అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. కేవలం అభిమానులే కాదు ప్రేక్షకుల్ను మాస్టర్ సినిమా బాగా ఆకట్టుకుంటోంది. పెద్ద పండుగ అయిన సంక్రాంతి బరిలో విజయ్ భారీ హిట్ సాధించడమే కాదు పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా తమిళం తో పాటు, తెలుగు. హిందీ లో 670 స్క్రీన్స్ లో ప్రదర్శింపబడుతోంది.