వైసీపీ పార్టీ గురించి మాట్లాడితే మొదట జగన్ పేరు వినబడితే తర్వాత స్థానం గురించి మాట్లాడుకోవాలి వస్తే ఎక్కువగా విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుకుంటారని ఏపీ రాజకీయాల్లో టాక్. రాజకీయంగా వైయస్ జగన్ ఎన్నో దెబ్బలు తిన్న టైం లో చాలా వరకు జగన్ భుజాన్ని కాచింది విజయసాయిరెడ్డి అని చాలామంది జగన్ సన్నిహితులు చెబుతుంటారు.ఇందువల్లే వైయస్ జగన్ ఎక్కువగా విజయసాయి రెడ్డి కి ప్రాధాన్యత ఇస్తారని..కీలక విషయాలు ఆయన దగ్గర చర్చించాకే క్యాబినెట్ లో మంత్రి ముందు పెడతారన్న టాక్ వుంది. అంతెందుకు విశాఖపట్టణం రాజధానిగా జగన్ చేస్తారని పార్టీలో అందరికంటే ముందుగా విజయసాయిరెడ్డికి తెలుసు అని వైసీపీ పార్టీ నాయకులు చెబుతుంటారు. ఇప్పుడు ఇదే విజయసాయిరెడ్డికి పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టినట్లు సమాచారం. విశాఖ పట్టణంలో రాజధాని వస్తుందని తెలిసిన విజయసాయిరెడ్డి… ఈ ప్రాంతంలో ఉన్న నాయకులకు తేలపక పోవడంతో ప్రస్తుతం విశాఖకు చెందిన రాజకీయ నేతలు విజయసాయిరెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నట్లు సమాచారం.
2015 నుండి రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి ఏ మాత్రం ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉండటంతో..చాలా సీక్రెట్ మెయింటెన్ చేయటంతో విశాఖ పొలిటికల్ లీడర్ లు విజయసాయి రెడ్డి ని గట్టిగా టార్గెట్ చేసినట్టు సమాచారం. దీంతో విజయసాయి రెడ్డి క్యారెక్టర్ ని బ్యాడ్ చేయాలని జగన్ నుండి దూరం చేయాలి అని ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ‘ఆపరేషన్ సాయి రెడ్డి క్యారెక్టర్’ విపక్ష పార్టీ సభ్యులు మరియు సొంత పార్టీ నేతలు మొదలెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఎక్కడో నెల్లూరుకు చెందిన విజయసాయిరెడ్డి విశాఖపట్టణంలో అది రాజధాని వచ్చే ప్రాంతంలో చక్రం తిప్పడం విశాఖకు చెందిన సొంత పార్టీ నాయకులతో పాటు ఇతర రాజకీయ పార్టీ నేతలు తట్టుకోలేక పోతున్నట్లు టాక్.
అమరావతి తరహాలో ఇక్కడ కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి ఉంటే పార్టీకి చెందిన నేతలు లబ్ధి పొందే వాళ్ళు, విజయసాయిరెడ్డి అలాకాకుండా అడ్డుపడ్డారు అని ఆయనపై… ఆయన క్యారెక్టర్ పై బురదజల్లడానికి సోషల్ మీడియాలో విశాఖ పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు ప్లస్ తెలుగుదేశం పార్టీలో ఉన్న మరి కొంతమంది నాయకులు కంబైన్డ్ రాజకీయం చేస్తున్నారన్న వార్తలు అందుతున్నాయి. దీనిలో భాగంగానే అల్లుడికి విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు దగ్గరుండి ఇపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఇప్పుడప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.