గత కొంత కాలంగా వైసీపీ పార్టీలో మరియు ఉత్తరాంధ్ర రాజకీయాలలో వైరల్ అవుతున్న న్యూస్ వైయస్ జగన్ కి మరియు విజయసాయి రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందని. ఇదే టైములో విశాఖ పట్టణంలో ఉన్న నాయకులు కూడా తీవ్రస్థాయిలో విజయ్ సాయి రెడ్డి మీద పరోక్షంగా సోషల్ మీడియాలో విమర్శలు చేయడం జరిగింది. పనిగట్టుకొని కొంతమంది వైజాగ్ లో ఉన్న బడా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే సోషల్ మీడియాలో గత కొంతకాలంగా సాయి రెడ్డి మీద చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఏకంగా ఓ అమ్మాయితో రాసలీలలు చేస్తున్నట్లు 60 సంవత్సరాల పైబడిన విజయసాయిరెడ్డి మీద రకరకాల బురదజల్లే కార్యక్రమాలు చేయడం జరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో వైయస్ జగన్ విమర్శకులకు మరియు విజయ సాయి రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమాలు చేసే వారికి దిమ్మతిరిగిపోయే రీతిలో విజయసాయి రెడ్డి పుట్టినరోజు నాడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి పదవీ బాధ్యతలు ఇవ్వటం అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా జగన్ కి మరియు విజయసాయి రెడ్డికి మధ్య ఈ పరిణామంతో గ్యాప్ లేదనే సందేశం ఇచ్చినట్లయింది. వైయస్ జగన్ కుటుంబానికి ఎప్పటినుండో సన్నిహితుడిగా రాజకీయాలలో ఇంకా అన్ని విషయాల్లో విజయసాయిరెడ్డిని జగన్ బలంగా నమ్ముతారు అని చాలామంది సన్నిహితులే చెబుతారు. అసలు వైజాగ్ లో రాజధాని వస్తుందని జగన్ తర్వాత విజయసాయిరెడ్డికి మాత్రమే తెలుసు అని కూడా చెబుతుంటారు. అందువల్లే 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న టైములో పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విజయసాయిరెడ్డికి ఎక్కువగా వైజాగ్ ప్రాంతానికి సంబంధించి పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందట.
కాగా అప్పటినుండి వైజాగ్ పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్న విజయసాయిరెడ్డి ఒకపక్క రాజధానికి సంబంధించి పనులను క్షుణ్ణంగా అప్పటినుండే చూడాలని అన్ని వనరులపై గ్రిప్ పెంచుకోవాలి అని జగన్ సాయిరెడ్డి కి తెలపడం జరిగిందట. చంద్రబాబు హయాంలోనే ఆయన వ్యవహరిస్తున్న తీరు బట్టి ఇది నిలబడే ప్రభుత్వం కాదని కాబట్టి వైజాగ్ ప్రాంతానికి సంబంధించి రాజధాని హంగులు కలిగిన ప్రతి ప్రదేశం గురించి క్షుణ్ణమైన వివరాలు మీ దగ్గరే ఉండాలని జగన్ ముందు నుండి వైజాగ్ కిరీటాన్ని విజయసాయి రెడ్డి పై పెట్టినట్లు జగన్ సన్నిహితులు చెబుతూ ఉంటారు. అందువల్లే పార్టీ ఓడిపోయిన తర్వాత వైజాగ్ ప్రాంత బాధ్యతలను తాను నమ్మిన బంటుగా ఎంతో నమ్మకం పెట్టుకున్న విజయసాయిరెడ్డి అప్పజెప్పడం జరిగిందట.
అయితే రాజధానిగా వైజాగ్ నగరాన్ని జగన్ అధికారంలోకి వచ్చాక ప్రకటించాక… విశాఖ పట్టణంలో ఉన్న బడా రాజకీయ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ భూమిని కబ్జా చేయాలన్నా మొదటి నుండి విజయసాయిరెడ్డి అక్కడే ఉండటంతో అడ్డుగా ఉంటున్నారట. పైగా వైజాగ్ ప్రాంతంలో భూమి యొక్క అని వివరాలు తన దగ్గర ఉండటం తో ఆ పప్పులేమి ఉడక నివ్వడం లేదట… దీంతో వైజాగ్ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులు విజయసాయి రెడ్డి పై బురదజల్లే కార్యక్రమం ఇటీవల స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలో ముందుగా జగన్ మరియు విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్ తీసుకువచ్చి ఇక్కడి నుండి జగన్ కి విజయ్ సాయి రెడ్డి మీద ఫిర్యాదులు బాగా చేస్తే…ఆయన నీ పక్కన పెడతారు తర్వాత మన పని కానిచుకోవచ్చు అని అనుకొని ప్లాన్లు వేసిన వారికి… వైయస్ జగన్ విజయసాయి రెడ్డి పుట్టినరోజు నాడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి పూర్తి బాధ్యతలు మరల విజయసాయి కి అప్పజెప్పడం తో… జగన్ దృష్టిలో విజయసాయిరెడ్డి స్థాయి ఎక్కడ తగ్గలేదు అన్న వార్త ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయ నాయకులకు, ఆయన ని తప్పించాలని చూసిన వారికి వెళ్లినట్లయింది. దీంతో వారంతా ఏం చేయలేని పరిస్థితిలో ఇటీవల విజయసాయిరెడ్డి గొప్ప నాయకుడు అంటూ ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం విశేషం.