ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన మూడు సవరణ బిల్లులపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు రైతులు, ఇటు ప్రతిపక్షాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఎన్డీఏ మిత్రపక్షమైన శిరోమణి అకాళీదళ్.. హర్సిమ్రత్ కౌర్ బాదల్ చేత కేంద్ర పదవికి రాజీనామా చేయించింది కూడా.
అయితే ఇలాంటి సమయంలో ఎన్డీఏ ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ సవరణ బిల్లులకు జగన్ పార్టీ మద్దతు ప్రకటించి ఊరటనిచ్చింది. లోక్ సభలో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వైసీపీ వ్యవసాయ బిల్లులకు మద్దతునిస్తుందని తెలిపారు. అలాగే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా మద్దతు ప్రకటించారు. ఈరోజు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా తమ పార్టీ వ్యవసాయ బిల్లులకు మద్దతునిస్తోందని తెలిపారు.