వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక తన పరిపాలన విషయంలో సామాన్య ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ‘రచ్చబండ’ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొట్టమొదటి రోజు సెప్టెంబర్ 2వ తారీఖున 2009 తలపెట్టిన ఈ కార్యక్రమానికి హెలికాప్టర్ లో బయలుదేరిన తరుణంలో ఆయన మరణించడం జరిగింది. ఇప్పుడు ఇదే మాదిరిగా వైయస్ జగన్ తన పరిపాలన గురించి సామాన్య జనుల నాడి తెలుసుకోవటానికి ‘రచ్చబండ’ కార్యక్రమం పేరట నేరుగా ప్రతి గ్రామంలో పర్యటించాలని జగన్ రెడీ అవ్వడం జరిగింది.
తండ్రి స్ఫూర్తితో జగన్ తల పెట్టబోతున్న ఈ కార్యక్రమానికి అంతా రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లిపోవడం జరిగింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ఇచ్చిన తర్వాత జగన్ ఈ ప్రోగ్రాం తలపెట్టనన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమం విషయంలో వైయస్ జగన్ కి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అడ్డు పడుతున్నట్లు పార్టీలో వినికిడి. పూర్తి విషయంలోకి వెళ్తే ‘రచ్చబండ’ పేరుతో ఈ ప్రోగ్రాం చేయవద్దని జగన్ ని విజయమ్మ కోరుతున్నట్లు… ఆ పేరుతో అయితే అసలు నువ్వు వెళ్ళవద్దు… వేరే పేరుతో అయితేనే బయలుదేరు అని విజయమ్మ కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రచ్చబండ కి బదులు ‘వైయస్సార్ దర్బార్’ గాని ‘గ్రామసభ’ అనే పేరు కానీ పెట్టాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ఈ రెండు పేర్లు జగన్ దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం. మరి జగన్ ఎటువంటి పేరుతో ఈ ప్రోగ్రాం చేస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.