YS Sharmila: ఇటీవల హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పలు రాజకీయ పార్టీలతో పాటు సినిమా సెలబ్రిటీలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల బాధిత కుటుంబాన్ని పరామర్శించి… కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బాధిత కుటుంబానికి 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. కెసిఆర్ ఇంట్లో ఒక కుక్క చనిపోతే.. ఆ కుక్క కి వైద్యం అందించిన అధికారిపై చర్య తీసుకోవడం మాత్రమేకాక కేసు ఫైల్ చేశారు. అటువంటిది రాష్ట్రంలో ఒక చిన్నారి ప్రాణం పోతే ఎందుకు కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వంలో అసలు చలనమే లేదని.. ఇటువంటి దారుణమైన సంఘటన జరిగి దాదాపు వారం కావస్తున్నా గాని నిందితుడిని పట్టుకోక పోవటం.. సిగ్గుచేటు అంటూ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు కూడా బాధిత కుటుంబం పట్ల కర్కశంగా వ్యవహరించారు అని.. మృతదేహాన్ని.. తల్లిదండ్రుల పై అదేరీతిలో బంధువులపై లాఠీఛార్జి చేసి తీసుకెళ్లినట్లు..వైయస్ షర్మిల ఆరోపించి అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను దీక్షకు కూర్చున్నట్టు ప్రకటించగా తాజాగా షర్మిల చేస్తున్న దీక్ష కు సంఘీభావంగా విజయమ్మ కూడా అక్కడికి చేరుకొని… వైయస్ షర్మిల తో పాటు వైఎస్ విజయమ్మ కూడా.. దీక్షలో కూర్చున్నారు. మరో పక్క పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులలో అన్ని చోట్లా వెతుకుతూ ఖచ్చితంగా అర్ధరాత్రి లోపు నిందితుడు రాజును పట్టుకుంటామని అంటున్నారు.