విజయనగరం: పైడితల్లి సిరిమానోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటలకు విజయనగరంలోని మూడు లాంతర్ల దగ్గర పైడితల్లి అమ్మవారి ఆలయం నుండి సిరిమాను రధం బయలుదేరింది. మూడు లాంతర్ల నుండి కోట వరకూ సిరిమాను రధం మూడు సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. కోట దగ్గర ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయులను ఆశీర్వదించి తిరిగి మూడు లాంతర్లకు చేరుకుంటుంది. 40 అడుగుల ఎత్తున సిరిమాను పీఠంపై ఆలయ పూజారి అమ్మవారి ప్రతిరూపంగా కూర్చుని భక్తులను ఆశీర్వదించారు. ఈ జాతర మహోత్సవాలను ఈ ఏడాది నుండి రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇవ్వడంతో కొత్త ఉత్సాహం నెలకొంది. సిరిమానోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?