NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆనాటి లెజెండ్ నటీనటులు ఎన్టీఆర్ తరం నాటి నుండి చిరంజీవి ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న తరం హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్న అతి పెద్ద భారీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. ఇండస్ట్రీలో అనేక సెన్సేషనల్ విజయాలు సాధించిన ఈ నిర్మాణ సంస్థ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు ప్రభంజనం సృష్టించిన.. సినిమాలను కూడా నిర్మించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోగా ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ వద్ద చలామణి అవుతున్న హీరోలతో యంగ్ హీరోలతో కూడా వైజయంతి మూవీస్ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో గతంలో వైజయంతి మూవీస్ కంత్రి, శక్తి లాంటి అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి పెద్దగా విజయం సాధించ లేక పోయింది. అయితే ఈ సారి ఎన్టీఆర్ తో మూడో అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా చేయడానికి వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీదత్ రెడీ అయినట్లు సమాచారం. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.
Read More: NTR: కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగుతున్న ఎన్టీఆర్..??
ఇది మాత్రమే కాకుండా “జగదేక వీరుడు అతిలోక సుందరి” సీక్వెల్ చేయాలని .. మరికొన్ని కీలక ప్రాజెక్టులు ప్రజెంట్ జనరేషన్ హీరోలతో చురుగ్గా మొదలుపెట్టాలని అశ్వినీ దత్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్. ఇదే రీతిలో “మహానటి” దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా .. అతి పెద్ద భారీ పాన్ ఇండియా సినిమా ఇప్పటికే వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు తర్వాత ఎన్టీఆర్ మిగతా ప్రాజెక్టులు ప్రారంభించాలని నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.