గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై వస్తున్న ప్రధాన విమర్శ కుల రాజకీయం. తమ రెడ్డి సామాజికవర్గానికి తప్ప మరెవ్వరికీ ఆయన ప్రాధాన్యం ఇవ్వడం లేదనేది ఆ కామెంట్.
ప్రధానంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ విమర్శ చేస్తోంది. తాజాగా దీనికి సమాధానం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి ఈ మేరకు రియాక్టయ్యారు.
విజయసాయిరెడ్డి ఏమన్నారంటే…
తాడేపల్లి, సీయం క్యాంప్ కార్యాలయంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈరోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రమేష్బాబుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేకి, కులతత్వ వాది అని ,ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు.
60 వేల కోట్లతో వైఎస్ జగన్….
కులపిచ్చి ఉన్న పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని విజయసాయిరెడ్డి విమర్శించారు. “రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 140 బీసీ వర్గాలకు గానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు గానీ, మైనార్టీలకు గానీ ప్రయోజనం చేకూర్చిన ప్రభుత్వం ఒక్క జగన్ ప్రభుత్వమే. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గత 15 నెలలుగా అందిస్తున్న పరిపాలనను గమనిస్తే.. ఈ విషయం అందరికి అర్ధమవుతుంది. కేవలం 14 నెలల కాలంలోనే రూ. 60 వేల కోట్లు ఈ వర్గాల సంక్షేమానికి ఖర్చు పెట్టిన ప్రభుత్వం కూడా ఇదే. 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు హయాంలో.. బడుగు, బలహీన వర్గాలకు పూర్తిగా అన్యాయమే జరిగింది. వారిని కేవలం రాజకీయం కోసమే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు“ అని విజయసాయిరెడ్డి విమర్శించారు. “ప్రతి వర్గానికి, ప్రతి కులానికి న్యాయం చేయగలిగింది ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే, అటువంటి పార్టీ ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని స్పష్టం చేశారు.
విశాఖ రాజధాని ఎవరి నిర్ణయమంటే…
ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలు ఏదైతే కోరుకుంటారో అదే నెరవేరుతుందని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నానికి తరలింపు అని వెల్లడించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నిర్ణయమేనని విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాజ్యంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికే ఆ అధికారం ఉంటుంది కాబట్టి ఎవరూ ఆపలేరని తెలిపారు. కోర్టులపై తమకు గౌరవం, విశ్వాసం ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తప్పకుండా ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి అతీతంగా వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలిపోతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?