ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలూ, ఇస్తున్న హింట్ లూ సంచలనంగా మారుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వంటివారిపై వరుస ట్వీట్లు చేస్తూ.. తనకు తెలిసిన నిజాలను చెబుతున్నారా లేక రాజకీయ ఆరోపణలు చేస్తున్నారా అనే అనుమానం మిగులుస్తుంటారు సాయిరెడ్డి! ఇందులో భాగంగా తాజాగా గంటా శ్రీనివాస్ పై ట్వీటారు!!
నిన్నమొన్నటివరకూ సుజనా చౌదరిపై “మిడతల దాడి” పేరున ట్విట్టర్ లో హల్ చల్ చేసిన విజయసాయి రెడ్డి… తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత విజయసాయిరెడ్డిపై సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూసినవారికి ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే అనే ఆలోచన రాదు సరికదా.. నెక్స్ట్ గంటానే అనే అనుమానం వస్తుంది. ఇంతకూ సాయిరెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం!
“తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..!
12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి!
ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని “బ్లాక్ లిస్టు” చేసినా.. “బ్లాక్ మనీ” కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!”
ఈ రేంజ్ లో గంటాపై సాయిరెడ్డి ట్విట్ చేశారు. గంటా అవినీతికి పాల్పడ్డాడు అని అనడం.. రాజకీయ ఆరోపణగా పరిగణించొచ్చు కానీ… పక్కాగా ఫిగర్స్ తో పాటు, కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ, ఆ కంపెనీపై ఉన్న ఆరోపణలను కూడా ప్రస్థావించడంతో… అచ్చెన్న అనంతరం గంటాకు ఛాన్స్ వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!!