NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీలో విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్..! చేరికలో ట్విస్ట్.. అది ఏమిటంటే..?

 

తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి నేడు సొంత గూటి (బీజేపీ)కి చేరారు. విజయశాంతి రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. 20 ఏళ్ల క్రితం బీజేపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం కోసం బీజేపీ నుండి బయటకు వచ్చారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ఉద్యమం చేశారు. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ ఆహ్వానం మేరకు పార్టీని టీఆరెస్ లో విలీనం చేసి టీఆర్ఎస్ నుండి ఎంపీగా గెలిచారు.

అనంతరం టీఆర్ఎస్ నుండి బయటకు పంపడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్ పర్సన్ పదవి కట్టబెట్టారు. అయితే సమీప భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చే పరిస్థితి లేకపోవడం, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పోసగక పోవడంతో రాష్ట్రంలో అధికార టీఆరెస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఎదగడంతో మరల బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలసి భేటీ అయ్యారు. అనంతరం సోమవారం ఉదయం విజయశాంతి 11గంటలకు పార్టీలో చేరుతున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. కండువా కప్పుకోవంలో ట్విస్ట్… ఢిల్లీ కేంద్ర పార్టీ కార్యాలయంలో విజయశాంతి చేరిక కార్యక్రమం ఉదయం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాలేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పార్టీలో జాయిన్ కార్యక్రమం ఏర్పాట్లు జరిగాయి.

అయితే విజయశాంతికి అరుణ్ సింగ్ పార్టీ కప్పడానికి ప్రయత్నించగా ఆమె సున్నితంగా తిరస్కరించారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా చేతుల మీదుగానే పార్టీ కండువా కప్పుకుంటానని తెలిపారు. దీనితో నడ్డా అపాయింట్మెంట్ తీసుకోని సోమవారం రాత్రి ఆయన నివాసంలో కలిసి ఆయనతో పార్టీ కండువా కప్పించుకున్నారు. అయితే ఈ విషయం తెలియని చాలా మీడియా సంస్థలు అరుణ్ సింగ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని బీజేపీ తీర్ధం పుచ్చుకున్నట్లు రిపోర్ట్ చేశాయి.

అయితే విజయశాంతి సోమవారం రాత్రి అధికారికంగా నడ్డా తో పార్టీ కండువా కప్పించుకొని బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన సందర్భంలో విజయశాంతి తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యమని పేర్కొంటూ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధువంతంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju