ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విజయశాంతి తాజాగా స్పీడ్ పెంచారు. గతంలో 2009వ సంవత్సరంలో టిఆర్ఎస్ ఎంపీగా మెదక్ లో రాణించిన ఆమె తాజాగా మళ్లీ అదే నియోజకవర్గంలో అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి 2014 అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయగా ఓడిపోవడం జరిగింది.
ఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికలలో విజయశాంతి పోటీ చేయకుండా విరమించుకున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన విజయశాంతి మెదక్ జిల్లా పై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో జిల్లాలో తనతో పాటు టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులతో విజయశాంతి ముచ్చటిస్తూ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే క్రమంలో బిజెపి పార్టీ తరఫున త్వరలో జిల్లా మొత్తం పర్యటించడానికి రెడీ అవుతున్నారట. అంతేకాకుండా అధికార పార్టీ టిఆర్ఎస్ లో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులను బీజేపీలో జాయిన్ చేసే రీతిలో రాములమ్మ రాజకీయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా లో రఘునందన్ తప్ప చెప్పుకోతగ్గ బీజేపీ నేత లేరు. అందువల్ల కొత్త వారిని పార్టీలోకి తీసుకుని వ్యక్తిగత మైలేజ్ పెంచుకోవటానికి విజయశాంతి వ్యూహాలు వేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. అంత మాత్రమే కాక తనని నమ్ముకుని పార్టీలోకి వచ్చే వారికి హామీలు కూడా అప్పుడే ఇచేస్తున్నారట విజయశాంతి.